Education22nd Nov 01:23 PMSunil Byrisetty1 min read

పిల్లలతో మాక్ అసెంబ్లీ!

పాఠశాల విద్యార్థులు తమ నియోజకవర్గాల సమస్యలపై గొంతు వినిపించేందుకు, రాష్ట్రాభివృద్ధి కోసం ప్రభుత్వానికి సూచనలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ నెల 26

పిల్లలతో మాక్ అసెంబ్లీ!
పాఠశాల విద్యార్థులు తమ నియోజకవర్గాల సమస్యలపై గొంతు వినిపించేందుకు, రాష్ట్రాభివృద్ధి కోసం ప్రభుత్వానికి సూచనలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ నెల 26న రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో ‘స్టూడెంట్ అసెంబ్లీ’ నిర్వహించనున్నారు. కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని వినూత్నంగా, వైవిధ్యంగా నడపడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 26న ఉదయం 9 గంటలకు స్టూడెంట్ అసెంబ్లీ ప్రారంభమవుతుంది. పాల్గొంటున్న విద్యార్థుల్లో ఒకరు ప్రోటెం స్పీకర్‌గా సభను ప్రారంభిస్తారు. ఆ తర్వాత స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికలు జరుగుతాయి. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల నుంచి ఒక్కొక్క విద్యార్థి ఎమ్మెల్యేగా పనిచేస్తారు. వీరిలో అధికార, ప్రతిపక్ష సభ్యులు ఉంటారు. ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతలుగా కూడా విద్యార్థులే వ్యవహరిస్తారు. సెక్రటరీ జనరల్, మార్షల్స్ పదవుల్లో కూడా విద్యార్థులే ఉంటారు. సాధారణ అసెంబ్లీల్లాగే ప్రశ్నోత్తరాలు, జీరో అవర్, రెండు బిల్లులపై చర్చలు, ఇతర అంశాలపై చర్చలు జరుగుతాయి. సుమారు 3 గంటల పాటు ఈ కార్యక్రమం సాగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు దీనిని వీక్షించేలా ఏర్పాటు ఉంటుంది. ప్రజలు కూడా చూసేలా కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. లఇప్పటికే పాఠశాల విద్యాశాఖ 8, 9, 10 తరగతుల నుంచి 175 మంది విద్యార్థులను ఎంపిక చేసింది. పాఠశాల స్థాయి నుంచి వివిధ దశల్లో పోటీలు నిర్వహించారు.
Andhra Pradesh
student-assembly
mock-assembly
constitution-day
Andhra-Pradesh
school-students
political-awareness
ఏపీ-ప్రభుత్వం
అసెంబ్లీ-కార్యక్రమం
విద్యార్థి-ఎమ్మెల్యేలు
విద్య-ప్రముఖ కార్యక్రమం
ప్రత్యక్ష-ప్రసారం
Scroll for the next article