TTD29th Jul 12:08 PMSunil Byrisetty1 min read
శ్రీవారికి బంగారు శంఖు, చక్రాలు విరాళం
తిరుమల తిరుపతి దేవస్థానానికి అరుదైన విరాళం అందింది. శ్రీ వేంకటేశ్వర స్వామివారికి విలువైన బహుమతిని భక్తులు విరాళంగా అందించారు. చెన్నైకు చెందిన సుదర్శన్ ఎంటర్ ప్రైజెస్ సంస్థ తిరుమల శ
తిరుమల తిరుపతి దేవస్థానానికి అరుదైన విరాళం అందింది. శ్రీ వేంకటేశ్వర స్వామివారికి విలువైన బహుమతిని భక్తులు విరాళంగా అందించారు. చెన్నైకు చెందిన సుదర్శన్ ఎంటర్ ప్రైజెస్ సంస్థ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి మంగళవారం సుమారు రూ.2.40 కోట్లు విలువైన దాదాపు రెండున్నర కేజీల బంగారు శంఖు, చక్రాలను విరాళంగా అందించింది.
ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు శ్రీవారి ఆలయంలోని రంగ నాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి శంఖు, చక్రాలను అందజేశారు. దేవస్థానం పాలకమండలి చర్చించి శంఖు, చక్రాలను స్వామివారికి ఏ విధంగా అలంకరించాలో నిర్ణయించనుంది.