News11th Apr 03:58 PMSunil Byrisetty2 min read
అంతరిక్షంలో అలా గడిచింది.. సునీతా విలియమ్స్ నమ్మలేని నిజాలు!
అంతరిక్షంలో 9 నెలలు గడిపి భూమిపైకి తిరిగి వచ్చిన సునీతా విలియమ్స్ దిగ్భ్రాంతికరమైన విషయాలను వెల్లడించారు. "అంతరిక్షంలో చిక్కుకుపోవడం దేవుని చిత్తమని భావిస్తున్నాను. " ఆహారం, నీరు అ
అంతరిక్షంలో 9 నెలలు గడిపి భూమిపైకి తిరిగి వచ్చిన సునీతా విలియమ్స్ దిగ్భ్రాంతికరమైన విషయాలను వెల్లడించారు.
"అంతరిక్షంలో చిక్కుకుపోవడం దేవుని చిత్తమని భావిస్తున్నాను.
" ఆహారం, నీరు అయిపోతే ఎలా కొనసాగుతానని ఆలోచిస్తున్నప్పుడు, చైత్ర నవరాత్రి సనాతన ఉపవాస మాసం గుర్తుకు వచ్చింది, ఆ రోజు నుంచి ఆహారం, నీరు కొద్దిగా తాగుతూ వచ్చా. నెల గడిచాక ఆరోగ్యంతోపాటు ఉల్లాసంగా కూడా ఉన్నా.
మరికొంత కాలం తట్టుకోగలనని కూడా గ్రహించా.
చనిపోతాననుకుని బైబిల్ చదువుదామని కంప్యూటర్ తెరిస్తే ఒక్క పేజీ చదవగానే బోర్ కొట్టింది.
అప్పుడు నాకు రామాయణం, భగవద్గీత మళ్ళీ చదవాలని అనిపించింది ఇంగ్లీష్ అనువాదం డౌన్లోడ్ చేసి చదవడం ప్రారంభించా.
10-15 పేజీలు చదివాక ఆశ్చర్యపోయా.
అందులోని పిండశాస్త్రం, లోతైన సముద్రం, ఆకాశం అద్భుతంగా ఉన్నాయి.
దాని గురించి ప్రపంచానికి చెప్పాలని నాకు అనిపించింది.
"అంతరిక్షం నుంచి చూస్తే సూర్యుడు బురద గుంటలో కూర్చున్నట్లు కనిపిస్తాడు.
కొన్నిసార్లు నేను సంస్కృత హిందీ అని భావించే మంత్రాలను పఠించడం వంటి కొన్ని శబ్దాలపై నుంచి వినిపిస్తాయి.
నేను రోజూ రామాయణం, భగవద్గీత చదవడం వల్ల ఇలా జరుగుతోందని నా ప్రయాణ సహచరుడు బారీ విల్మోర్ చెప్పాడు.
అలా 8 నెలల తర్వాత, రామాయణం, భగవద్గీత మొత్తం చదివా.
భూమికి తిరిగి రావాలని భావించడం ప్రారంభించా.
నాలో అసాధారణమైన ఆత్మవిశ్వాసం నిండింది.
ఏప్రిల్ నెలలో, సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు, త్రిశూలంతో మాతాజీతో ఉన్న సింహాన్ని పోలిన ఒక జీవి పై నుంచి భూమికి దిగినట్లు కనిపించింది.
ఇది భూ వాతావరణాన్ని చేరుకున్న తర్వాత, అది కనిపించలేదు.
ఇది ఎక్కడ నుంచి వస్తుందో నాకు అర్థం కాలేదు, కాబట్టి నేను, బారీ విల్లిమోర్ దానిని చూడటం ప్రారంభించాం.
అది పైన ఉన్న ప్రత్యేక పొర నుంచి క్రిందికి వస్తున్నట్లు నాకు అనిపించింది, ఆకాశంలో ఒకటి కంటే ఎక్కువ పొరలు ఉన్నాయని అర్థం చేసుకున్నా.
వారు దేవుని ఆశీర్వాదంతో వస్తున్న దేవదూతలు అని అనుకుంటున్నా.
"సనాతన భగవద్గీత నిజమని భావిస్తున్నా. ఇప్పుడు నా పరిశోధన వేదాల శాస్త్రంపై ఉంటుంది.
ఎంబ్రియాలజీ, డీప్ సీ సైన్స్, ఖగోళ శాస్త్రం గురించి నేర్చుకోవాలనుకుంటున్నా.
వేదాలకున్న అతీంద్రియ శక్తులను తెలుసుకోవడానికి నాసాలో కొత్త విభాగాన్ని ప్రారంభించాలని ప్రతిపాదించబడింది.
అందుకు అవసరమైన నిధులను ట్రంప్ ప్రభుత్వం కేటాయిస్తుందా లేదా అనే ఆందోళనను‘‘ కూడా సునీత పంచుకున్నారు.