Politics13th Jan 01:27 PMSunil Byrisetty1 min read
వివేకా హత్య కేసులో మరోసారి సుప్రీంకు సునీత
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఎంతకూ తెగడం లేదు. దీంతో ఆయన కుమార్తె సునీత సుప్రీంకోర్టులో మరో అప్లికేషన్ దాఖలు చేశారు. సీబీఐ విచారణ కొనసాగింపు అంశంపై మరొక అప్లికేషన్
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఎంతకూ తెగడం లేదు. దీంతో ఆయన కుమార్తె సునీత సుప్రీంకోర్టులో మరో అప్లికేషన్ దాఖలు చేశారు. సీబీఐ విచారణ కొనసాగింపు అంశంపై మరొక అప్లికేషన్ ఇచ్చారు. పాక్షికంగానే అనుమతిస్తూ ట్రయల్ కోర్టు ఉత్తర్వులు ఇవ్వడాన్ని సునీత సవాల్ చేశారు. దీంతో ప్రస్తుత అప్లికేషన్, పెండింగ్ పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది. సీబీఐ విచారణ కొనసాగించే అంశంపై నిర్ణయం తీసుకోవాలని గతంలో హైదరాబాద్ సీబీఐ ప్రత్యేక కోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది.