National27th Jul 04:45 PMSunil Byrisetty1 min read
అయోధ్య విరాళాల చోరీ కేసుపై సుప్రీంకోర్టు విచారణ
అయోధ్య విరాళాల చోరీ కేసుపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. రెండు వారాల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని సిట్కు సుప్రీంకోర్టు గడువు విధించింది. యూపీ ప్రభుత్వం నియమించిన సిట్లో ఫోరెన్సిక్
అయోధ్య విరాళాల చోరీ కేసుపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. రెండు వారాల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని సిట్కు సుప్రీంకోర్టు గడువు విధించింది. యూపీ ప్రభుత్వం నియమించిన సిట్లో ఫోరెన్సిక్ ఆడిటర్ను చేర్చాలని ఆదేశాలిచ్చింది. ఫోరెన్సిక్ ఆడిటర్ను చేర్చాలన్న సుప్రీంకోర్టు సూచనకు యూపీ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. అయోధ్య విరాళాల చోరీ కేసు విచారణను వేగవంతం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది. ఐజీ కిరణ్ అధ్యక్షతన సిట్ ఏర్పాటు చేసినట్లు కోర్టుకు సొలిసిటర్ జనరల్ తెలిపారు. సిట్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని సుప్రీంకోర్టు ప్రకటించింది.