News21st Jan 04:23 PMSunil Byrisetty1 min read
ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు విచారణ
ఢిల్లీలో కాలుష్య నివారణకు కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కీలక ప్రతిపాదనలను కోర్టుకు సమర్పించింది. ఢిల్లీలో కాలుష్యానికి వాహనాలే కారణమని పేర్కొంది. అధిక కాలుష్య కారక వాహనాలన
ఢిల్లీలో కాలుష్య నివారణకు కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కీలక ప్రతిపాదనలను కోర్టుకు సమర్పించింది. ఢిల్లీలో కాలుష్యానికి వాహనాలే కారణమని పేర్కొంది. అధిక కాలుష్య కారక వాహనాలను దశలవారీగా తొలగించాలని సూచించింది. మెట్రో రైల్ నెట్వర్క్ను విస్తరించాలన్నారు. ఎలక్ట్రిక్ వాహన విధానాలు సవరించాలన్నారు. ఢిల్లీ ఎంట్రీ పాయింట్స్ దగ్గర రద్దీ తగ్గించడానికి CAQM సిఫార్సులను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. కాలుష్య పరిష్కారానికి దీర్ఘకాలిక చర్యలు తీసుకోవాలని, 4 వారాల్లోగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సుప్రీంకోర్టు సూచించింది.