News12th Jan 02:40 PMSunil Byrisetty1 min read

ఏపీకి లైన్ క్లియర్.. తెలంగాణకు షాక్

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఏపీకి లైన్ క్లియర్ అయింది. పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్ట్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ ప్రాజెక్ట్‌పై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన

ఏపీకి లైన్ క్లియర్.. తెలంగాణకు షాక్
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఏపీకి లైన్ క్లియర్ అయింది. పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్ట్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ ప్రాజెక్ట్‌పై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ విచారణకు అర్హత లేదని పేర్కొంది. పోలవరం ప్రాజెక్టును నల్లమల సాగర్‌తో లింక్ చేయడం వల్ల తెలంగాణకు నష్టమని, గోదావరి నీటి కేటాయింపులు ఉల్లంఘన అవుతున్నాయని కోర్టుకు తెలంగాణ వివరించింది. వాదనలు విన్న సుప్రీంకోర్టు.. ఈ పిటిషన్ ను కొనసాగించలేమని, ఈ కేసుతో కర్ణాటక, మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాలు కూడా ముడిపడి ఉన్నాయని వ్యాఖ్యానించింది. అందుకే, ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు (మీడియేషన్ లేదా సివిల్ సూట్) ద్వారా పరిష్కారం కోరవచ్చని సూచించింది. దీంతో, తమ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నామని సుప్రీంకోర్టుకు తెలంగాణ తెలిపింది.
Andhra Pradesh
Polavaram Project
Nallamala Sagar
Supreme Court Verdict
Telangana
Godavari Water Allocation
రాష్ట్ర మధ్య నీటి వివాదం
మహారాష్ట్ర
కర్ణాటక
మధ్యస్థ పరిష్కారం
Scroll for the next article