News13th Jul 10:00 AMSunil Byrisetty1 min read
రాష్ట్రానికి స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు
రాష్ట్రానికి మరోసారి స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు దక్కాయి. వివిధ కేటగిరీల్లో అవార్డులకు పలు మున్సిపాలిటీలు ఎంపికయ్యాయి. ఈ నెల 17 న ఢిల్లీలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ చేతుల మీదుగా మంత
రాష్ట్రానికి మరోసారి స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు దక్కాయి. వివిధ కేటగిరీల్లో అవార్డులకు పలు మున్సిపాలిటీలు ఎంపికయ్యాయి. ఈ నెల 17 న ఢిల్లీలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ చేతుల మీదుగా మంత్రి పొంగూరు నారాయణ
అవార్డులు అందుకోనున్నారు.
సూపర్ స్వచ్ లీగ్ అవార్డుల కేటగిరీ(జనాభా ప్రాతిపదికన)
1).10 లక్షల కంటే ఎక్కువ జనాభా కేటగిరీలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్
2).3లక్షల నుంచి 10 లక్షల లోపు కేటగిరీ లో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్
3)50 వేల నుంచి 3 లక్షల జనాభా కేటగిరీలో తిరుపతి మునిసిపల్ కార్పోరేషన్ కు అవార్డులు లభించాయి.
మినిస్టీరియల్ అవార్డ్(స్పెషల్ కేటగిరీ) - గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్.
మినిస్టీరియల్ అవార్డ్(స్టేట్ లెవెల్) - రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఎంపిక కావడంపై సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ హర్షం వ్యక్తం చేశారు.