National24th Aug 11:32 AMSunil Byrisetty1 min read
బిడ్డ పుడితే ఏడాది సెలవులు.. సీఎం కీలక నిర్ణయం
ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు తమిళనాడు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి ప్రస్తుతం ఇస్తున్న మెటర్నిటీ సెలవులను భారీగా పెంచింది. మూడో బిడ్డ కోసం ప్రస్తుతం ఇస్తున్న 12 వారాల సెలవులను
ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు తమిళనాడు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి ప్రస్తుతం ఇస్తున్న మెటర్నిటీ సెలవులను భారీగా పెంచింది. మూడో బిడ్డ కోసం ప్రస్తుతం ఇస్తున్న 12 వారాల సెలవులను 365 రోజులకు పెంచుతూ సీఎం విజయ్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో తొలి, రెండో బిడ్డతో పాటు మూడో బిడ్డకు కూడా మహిళా ఉద్యోగులు ఏడాది పాటు పూర్తి జీతంతో కూడిన సెలవులు పొందనున్నారు. రాష్ట్రంలో జననాల సంఖ్య 1.4కు పడిపోయిన నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నిర్ణయంపై తమిళనాడు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.