Politics8th Oct 03:22 PMSunil Byrisetty1 min read
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీకి టీడీపీ దూరం
మాగంటి గోపినాథ్ మృతితో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. పార్టీ శ్రేణులు సమాయ
మాగంటి గోపినాథ్ మృతితో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. పార్టీ శ్రేణులు సమాయత్తంగా లేరన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలోని పార్టీ నాయకులతో చర్చించిన అనంతరం సీఎం చంద్రబాబు ఈ నిర్ణయానికి వచ్చారు. ఉప ఎన్నికల్లో ఏ పార్టీకీ మద్దతు ఇవ్వరాదని కూడా నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ తెలుగుదేశం నాయకులతో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సమావేశమై, ఏపీలో కూటమిగా ఉన్నందున జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ కోరితే, మద్దతివ్వవచ్చని సూచించినట్లు సమాచారం.