Politics26th Aug 03:52 PMSunil Byrisetty1 min read
కార్యకర్తల కోసమే టీడీపీ
టీడీపీకి ఉన్న విధి విధానాలు గానీ, అమరిక గానీ ప్రపంచంలో ఏ పార్టీకి కూడా లేవని ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. పాలన, సంక్షేమ, అభివృద్ధినీ ప్రజలకు చేరువ చేయడానికి ము
టీడీపీకి ఉన్న విధి విధానాలు గానీ, అమరిక గానీ ప్రపంచంలో ఏ పార్టీకి కూడా లేవని ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.
పాలన, సంక్షేమ, అభివృద్ధినీ ప్రజలకు చేరువ చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిత్యం కృషి చేస్తున్నారని తెలిపారు. యువ నాయకులు లోకేష్ వచ్చిన తర్వాత పార్టీ మెంబర్ షిప్ ద్వారా ప్రతి ఒక్కరికి ఫెసిలిటీ కల్పిస్తున్నామని వివరించారు.
మెంబర్ షిప్ ద్వారా ఉన్నతస్థాయి పదవులు కల్పిస్తున్నామన్నారు. జిల్లాలో 17 విభాగాల్లో కార్యవర్గాన్ని నియమించేందుకు ఈ సమావేశం నిర్వహించినట్లు వెల్లడించారు. విజయనగరం జిల్లాలో అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్తాం.. ప్రతి విభాగంలో ప్రాధాన్యత ఇస్తామని అన్నారు.