News29th May 04:05 PMSunil Byrisetty1 min read
కార్యకర్తల కృషితోనే దిగ్విజయం!
కార్యకర్తల కృషి వలనే గత ఎన్నికల్లో జిల్లాలో 10 సీట్లకు ఏడు స్థానాలను గెలిచామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. కడపలో నిర్వహించిన మహానాడులో ఆయన మాట్లాడుతూ చంద్
కార్యకర్తల కృషి వలనే గత ఎన్నికల్లో జిల్లాలో 10 సీట్లకు ఏడు స్థానాలను గెలిచామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. కడపలో నిర్వహించిన మహానాడులో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో రాష్ట్రం సుభిక్షింగా ఉందన్నారు. ఈ ప్రాంతం నుంచి నాడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ రెడ్డి ఈ ప్రాంత ప్రజలకు చేసింది ఏమి లేదన్నారు. టీడీపీ కార్యకర్తలను హింసించడం, హత్యారాజకీయాలు చేయడం తప్ప చేసిందేమీ లేదన్నారు. నమ్మకానికి, విశ్వాసానికి చంద్రబాబు నాయుడు, నారాలోకేష్ నిదర్శనమని కొనియాడారు. మరో 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు, లోకేష్ లు ఉంటనే ఈ ప్రాంత ప్రజలకు మేలు జరిగేది అని వివరించారు.