News23rd Jul 04:28 PMSunil Byrisetty1 min read
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ తో టీడీపీ నూతన ఎంపీల సమావేశం
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా తెలుగుదేశం పార్టీకి చెందిన నూతన ఎంపీలు సానా సతీష్ , భాష్యం రామకృష్ణ , చింతకాయల విజయ్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ ని సెషన్
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా తెలుగుదేశం పార్టీకి చెందిన నూతన ఎంపీలు సానా సతీష్ , భాష్యం రామకృష్ణ , చింతకాయల విజయ్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ ని సెషన్ విరామ సమయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల నిర్వహణ, రాజ్యసభ సెషన్స్ వేళ చర్చకు రానున్న వివిధ ప్రధాన అంశాలు మరియు పార్లమెంటరీ విధానాలపై వారు సమగ్రంగా చర్చించారు. కొత్తగా ఎన్నికైన ఎంపీలుగా సభలో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాటించాల్సిన సభా నియమావళిపై రాజ్యసభ డిప్యూటీ చైర్మన్తో వారు ప్రత్యేకంగా మాట్లాడారు. దీనితో పాటు రాష్ట్ర ప్రయోజనాలు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక విషయాలపై కూడా ఈ సమావేశంలో ఫలప్రదమైన చర్చలు జరిగాయి. అనంతరం కేంద్ర సమాచార ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ను మర్యాదపూర్వకంగా కలిశారు.