Politics30th Nov 03:36 PMSunil Byrisetty1 min read
డిసెంబర్లో టీడీపీ పదవుల పండుగ!
తెలుగుదేశం పార్టీలో పెండింగ్లో ఉన్న రాష్ట్ర, జిల్లా కమిటీల జాబితా సిద్ధమైంది. పార్టీ నేతలు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న కమిటీల జాబితా విడుదలపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షు
తెలుగుదేశం పార్టీలో పెండింగ్లో ఉన్న రాష్ట్ర, జిల్లా కమిటీల జాబితా సిద్ధమైంది. పార్టీ నేతలు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న కమిటీల జాబితా విడుదలపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పష్టతనిచ్చారు. డిసెంబర్ 16 నాటికి తుది జాబితాను తయారు చేస్తామని, సామాజిక ప్రాతినిధ్య అవసరాలకు అనుగుణంగా ఉండేలా చూస్తామని ఆయన అన్నారు. డిసెంబర్ 17న మంత్రి నారా లోకేష్ తుది కమిటీ జాబితాను సమీక్షిస్తారని, ఆ తర్వాత అధికారికంగా ప్రకటిస్తారని ఆయన తెలిపారు. పోలవరం, సింగనమల, జీడీ నెల్లూరు నియోజకవర్గాల్లోని రెండు మండలాల్లో కమిటీలకు సంబంధించి అభ్యంతరాలు లేవనెత్తామని, ఆ మండలాల్లో మళ్లీ ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహిస్తామని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, టీడీపీ తన నాయకులకు ఎన్టీఆర్ భవన్లో శిక్షణా సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సోమ, మంగళవారాల్లో దాదాపు 100 మంది టీడీపీ మండల అధ్యక్షులకు శిక్షణ ఇస్తారు.