News16th Aug 11:48 AMSunil Byrisetty1 min read

విజయవాడలో టీచర్ల ఆత్మగౌరవ ర్యాలీ

విజయవాడలో టీచర్లు ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. డీఎస్సీ-2025 విజేతల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి అంబేద్కర్ స్మృతి వనం వరకు ఈ ర్యాలీ కొనసాగి

విజయవాడలో టీచర్ల ఆత్మగౌరవ ర్యాలీ
విజయవాడలో టీచర్లు ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. డీఎస్సీ-2025 విజేతల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి అంబేద్కర్ స్మృతి వనం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. టీచర్లు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. తమపై విమర్శలు చేసే వారికి బుద్ధి ప్రసాదించాలని వినతిపత్రం అందజేశారు. ఉమ్మడి ప.గో., కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి ర్యాలీకి టీచర్లు హాజరయ్యారు. డీఎస్సీ-2025 విజేతల ఎంపికపై వైసీపీ చేస్తున్న విమర్శలపై టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తే సహించబోమని ఉపాధ్యాయులు హెచ్చరించారు. ఇప్పటికే కర్నూలు, తిరుపతి సహా పలు జిల్లాల్లో డీఎస్సీ విజేతల ఆధ్వర్యంలో ర్యాలీలు జరిగాయి.
Andhra Pradesh
Education
Vijayawada
Teachers Rally
Self-Respect Rally
DSC 2025
DSC Winners
Teachers
అంబేద్కర్ స్మృతి వనం
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం
ఉపాధ్యాయ నియామకాలు
వైసీపీ విమర్శలు
Scroll for the next article