Education14th Mar 12:00 PMSunil Byrisetty1 min read
తెలంగాణలో ఒంటిపూట బడులు
రాష్ట్రంలో ఎండ తీవ్రతల నేపథ్యంలో ఒంటిపూట బడులు నడపాలని విద్యాశాఖ నిర్ణయించింది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలను ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 23 వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం
రాష్ట్రంలో ఎండ తీవ్రతల నేపథ్యంలో ఒంటిపూట బడులు నడపాలని విద్యాశాఖ నిర్ణయించింది.
ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలను ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 23 వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహిస్తారు.
మధ్యాహ్న భోజనాన్ని 12:30 గంటలకు అందజేస్తారు.
పదో తరగతి పరీక్షాకేంద్రాలున్న పాఠశాలల్లో మాత్రం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 5 గంటల వరకు స్కూళ్లను నిర్వహిస్తారు.
పది పరీక్షలు ముగిసిన తర్వాత మళ్లీ ఉదయం పూటే ఆయా బడులు నడుస్తాయి.