Telangana15th Jul 11:22 AMSunil Byrisetty1 min read
ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ షాక్!
ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది. బనకచర్ల ప్రాజెక్ట్పై చర్చించడానికి విముఖత వ్యక్తం చేస్తూ లేఖ రాసింది. బనకచర్లపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్రం ఢిల్లీలో సమావ
ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది. బనకచర్ల ప్రాజెక్ట్పై చర్చించడానికి విముఖత వ్యక్తం చేస్తూ లేఖ రాసింది. బనకచర్లపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్రం ఢిల్లీలో సమావేశానికి ఏర్పాట్లు చేసింది. బనకచర్ల సింగిల్ ఎజెండాతో ఏపీ ప్రభుత్వం సమావేశానికి ప్రతిపాదన చేసింది. అయితే చర్చ అవసరం లేదంటూ ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం తిరస్కరించింది. రెండు రోజులుగా ముఖ్యమంత్రుల సమావేశంపై తెలంగాణలో జోరుగా చర్చ జరుగుతోంది. లేనిపోని అనుమానాలకు తావివ్వడం ఇష్టం లేకనే తెలంగాణ ప్రభుత్వం చర్చకు నో చెప్పినట్లుగా సమాచారం.