Telangana2nd Sep 03:41 PMSunil Byrisetty1 min read

కాళేశ్వరం.. సీబీఐ విచారణకు తెలంగాణ నిర్ణయం

కాళేశ్వరం అవకతవకలపై సీబీఐ విచారణకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మించిన మెడిగడ్డ, అన్నారం, సుందిల్ల బారేజీల నిర్మాణంలో జరిగిన అనేక అవకతవకలు, ఆర్థి

కాళేశ్వరం.. సీబీఐ విచారణకు తెలంగాణ నిర్ణయం
కాళేశ్వరం అవకతవకలపై సీబీఐ విచారణకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మించిన మెడిగడ్డ, అన్నారం, సుందిల్ల బారేజీల నిర్మాణంలో జరిగిన అనేక అవకతవకలు, ఆర్థిక దుర్వినియోగం, నాణ్యతా లోపాలు, ప్రణాళికా లోపాలు వెలుగులోకి రావడంతో, రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాలపై దర్యాప్తును సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి అప్పగించాలని నిర్ణయించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో గోదావరి నదిపై మూడు బారేజీలు నిర్మించబడ్డాయి. 2023 అక్టోబర్ 21న మెడిగడ్డ బారేజీలోని పీలర్లు (16, 17, 18, 19, 20, 21) కూలిపోవడంతో ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణ నాణ్యతపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిపై జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ చేసిన పరిశీలనలో నిర్మాణంలో తీవ్ర లోపాలు, నాణ్యత నియంత్రణ లోపం, ప్రణాళికలో నిర్లక్ష్యం ఉన్నట్లు తేలింది.
Telangana
Kaleshwaram Project
CBI Probe
Medigadda Barrage
Annaram Barrage
Sundilla Barrage
Project Irregularities
Corruption
Financial Misuse
నాణ్యతా లోపాలు
ప్రణాళికా లోపాలు
గోదావరి నది
Scroll for the next article