News16th Jul 08:26 AMSunil Byrisetty1 min read
ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం
నేడు ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం జరగనుంది. అంతర్రాష్ట్ర నదీ జలాలకు సంబంధించిన అంశాలపైనే చర్చ నిర్వహించనున్నారు. కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ సమక్షంలో ఈ భేటీ జరగ
నేడు ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం జరగనుంది. అంతర్రాష్ట్ర నదీ జలాలకు సంబంధించిన అంశాలపైనే చర్చ నిర్వహించనున్నారు. కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ సమక్షంలో ఈ భేటీ జరగనుంది. సమావేశానికి సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపైనే చర్చించాలని ఏపీ అజెండా ప్రతిపాదించింది. అయితే బనకచర్లపై చర్చించేది లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. బనకచర్లపై చర్చించేది లేదని కేంద్రానికి తెలంగాణ లేఖ కూడా రాసింది. ఆర్థిక సాయంపై చర్చించాలని తెలంగాణ ప్రభుత్వం లేఖ పంపింది.
సమావేశం అజెండాపై సందిగ్ధత కొనసాగుతోంది.