Politics6th Aug 12:03 PMSunil Byrisetty1 min read
టీడీపీ Vs వైసీపీగా ఉద్రిక్తత
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉద్రిక్తత తలెత్తింది. వైసీపీ నిరాహారదీక్ష టెంట్ ను టీడీపీ తొలగించింది. ముత్యాలంపాడులో టీడీపీ, వైసీపీ కార్యకర్తల ఘర్షణకు దిగారు. ఇరుపార్టీల కార్యకర్తల
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉద్రిక్తత తలెత్తింది. వైసీపీ నిరాహారదీక్ష టెంట్ ను టీడీపీ తొలగించింది. ముత్యాలంపాడులో టీడీపీ, వైసీపీ కార్యకర్తల ఘర్షణకు దిగారు. ఇరుపార్టీల కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. వైసీపీ ధర్నాను టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా అడ్డుకుని, వైసీపీ అనధికారికంగా ధర్నా చేస్తోందంటూ ధ్వజమెత్తారు. ధర్నా చౌక్ వదిలి ప్రజలను ఇబ్బంది పెట్టేలా వైసీపీ చర్యలు ఉన్నాయన్నారు. మరోవైపు డీఎస్సీ అక్రమాలపై దీక్ష చేస్తున్న YSRCP నేతలపై దాడి చేశారంటూ ఆ పార్టీ కార్యకర్తలు మండిపడ్డారు. మల్లాది విష్ణుపై దాడికి యత్నించారని ఆరోపించారు.