News10th May 04:12 PMSunil Byrisetty1 min read
ఆపరేషన్ సిందూర్లో ఐదుగురు కీలక ఉగ్రవాదులు హతం
ఆపరేషన్ సిందూర్లో ఐదుగురు కీలక ఉగ్రవాదులు హతమైనట్లు భారత ఆర్మీ పేర్కొంది. వారెవరంటే.. ముదస్సర్ ఖదాయిన్ ఖాస్ అలియాస్ అబు జుందాల్: ఇతను లష్కరే తోయిబా కీలక ఉగ్రవాది. ఇతని అంత్యక
ఆపరేషన్ సిందూర్లో ఐదుగురు కీలక ఉగ్రవాదులు హతమైనట్లు భారత ఆర్మీ పేర్కొంది. వారెవరంటే..
ముదస్సర్ ఖదాయిన్ ఖాస్ అలియాస్ అబు జుందాల్: ఇతను లష్కరే తోయిబా కీలక ఉగ్రవాది. ఇతని అంత్యక్రియలను పాక్ సైన్యం అధికారిక లాంఛనాలతో నిర్వహించినట్లు సమాచారం. అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ అబ్దుల్ రవూఫ్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి పాక్ ఆర్మీ చీఫ్, పంజాబ్ (పాక్లోని) సీఎం, ఐజీ హాజరైనట్లు తెలుస్తోంది.
హఫీజ్ మహమ్మద్ జమీల్: జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థలో కీలక సభ్యుడు. సంస్థ వ్యవస్థాపకుడు మసూద్ అజార్కు ఇతను పెద్ద బావమరిది.
మహమ్మద్ యూసఫ్ అజార్ అలియాస్ ఉస్తాద్ జీ అలియాస్ సలీమ్ అలియాస్ సాహబ్: జైషే ముఠా ముఖ్య ఉగ్రవాది. మసూద్ అజార్కు ఇతను మరో బావమరిది. ఐసీ-814 విమాన హైజాక్ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.
ఖలీద్ అలియాస్ అబు అకాస: లష్కరే తోయిబా టాప్ ఉగ్రవాది. జమ్ముకశ్మీర్లో అనేక ఉగ్రదాడులకు ఇతను నేతృత్వం వహించాడు. ఫైసలాబాద్లో ఇతని అంత్యక్రియలకు పాక్ సీనియర్ ఆర్మీ అధికారులు, స్థానిక డిప్యూటీ కమిషనర్ హాజరైనట్లు సమాచారం.
మహమ్మద్ హసన్ ఖాన్: జైషే మహమ్మద్ ముఠాలో కీలక సభ్యుడు. పీవోకేలోని జైషే ఆపరేషనల్ కమాండర్ ముఫ్తి అస్గర్ ఖాన్ కశ్మీరీ కుమారుడు. జమ్ముకశ్మీర్లోకి ఉగ్రవాదులను పంపించడంలో ఇతనిది ప్రధాన పాత్ర.