Education Type5th May 04:35 PMSunil Byrisetty1 min read
ఫీజు బకాయిలపై సిఫార్సుల కమిటి
ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలపై ఏపీ ప్రభుత్వం సిఫార్సుల కమిటీని నియమించింది. గత ప్రభుత్వ హయాంలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ విధానంలో వచ్చిన సమస్యలను అధిగమించేందుకు ఈ కమిటీ సిఫా
ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలపై ఏపీ ప్రభుత్వం సిఫార్సుల కమిటీని నియమించింది.
గత ప్రభుత్వ హయాంలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ విధానంలో వచ్చిన సమస్యలను అధిగమించేందుకు ఈ కమిటీ సిఫార్సులు అందించనుంది.
2023 - 24 విద్యాసంవత్సరంలో బకాయిలు చెల్లింపులో పారదర్శకతకు సిఫార్సులు చేయడానికి ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
ఈ కమిటీ 10 రోజుల్లోగా తమ సిఫార్సులు ప్రభుత్వానికి అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఈ కమిటీలో సోషల్ వెల్ఫేర్, బిసి వెల్ఫేర్, గిరిజన వెల్ఫేర్, కాలేజియేట్ ఎడ్యుకేషన్, సాంకేతిక విద్య డైరెక్టర్లు, ప్రైవేట్ కాలేజీల నుండి ఒక ప్రతినిధి సభ్యులుగా ఉండనున్నారు.