Education6th May 09:50 AMSunil Byrisetty1 min read
'పీఎంశ్రీ' పథకంతో ఏపీ బడులు బాగు!
కేంద్ర ప్రభుత్వం 'పీఎంశ్రీ' పథకంతో పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు నిధులు అందిస్తోంది. అందులో భాగంగా ఏపీలో పలు బడుల్లో అభివృద్ధి జరగనుంది. విద్యార్థుల్లో నైతిక విలువలు పెంచి, క్రీడలు
కేంద్ర ప్రభుత్వం 'పీఎంశ్రీ' పథకంతో పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు నిధులు అందిస్తోంది.
అందులో భాగంగా ఏపీలో పలు బడుల్లో అభివృద్ధి జరగనుంది.
విద్యార్థుల్లో నైతిక విలువలు పెంచి, క్రీడలు, వ్యాయామం, యోగాలో ప్రావీణ్యం కల్పించేందుకు పీఎంశ్రీ (ప్రధాన మంత్రి స్కూల్స్ రైజింగ్ ఫర్ ఇండియా) పథకానికి కేంద్రం శ్రీకారం చుట్టింది.
రాష్ట్రంలో ఉన్న మండలాల్లో ఒక జడ్పీ ఉన్నత పాఠశాలను పీఎంశ్రీ కింద ఎంపిక చేసింది.
ఆయా పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, క్రీడా మైదానాల అభివృద్ధి చేపడుతోంది.
వేసవి సెలవుల్లో ఈ పనులు పూర్తి చేయాలని ఆదేశించింది.