News25th Mar 01:28 PMSunil Byrisetty1 min read

దంతెవాడలో ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోలు మృతి

దేశంలో మావోయిస్టుల ఏరివేత కొనసాగుతోంది. 2026 నాటికి మావోయిస్టు రహితంగా చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మావో ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా

దంతెవాడలో ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోలు మృతి
దేశంలో మావోయిస్టుల ఏరివేత కొనసాగుతోంది. 2026 నాటికి మావోయిస్టు రహితంగా చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మావో ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా దళాలు జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్-దంతెవాడ సరిహద్దుల్లో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య భీకర ఎన్ కౌంటర్ జరిగింది. ఇందులో ఐదుగురు నక్సల్స్ హతమయ్యారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలంలో పోలీసులు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. కాగా ఇటీవల పలు ఎన్కౌంటర్లలో భారీగా మావోలు మరణించిన విషయం తెలిసిందే.
Chhattisgarh
Dantewada
Encounter
మావోయిస్టు
Scroll for the next article