Sports4th Aug 06:48 PMSunil Byrisetty1 min read
టీట్వంటీని తలపించిన టెస్ట్
ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ సిరీస్లో ఇండియా మజా చూపించింది. టీట్వంటీ ప్లేయర్లకు టెస్ట్ మ్యాచ్ ఆడే ఓపిక ఉంటుందా అని అనుమానంతో భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ 5 టెస్టుల సిరీస్ షురూ
ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ సిరీస్లో ఇండియా మజా చూపించింది. టీట్వంటీ ప్లేయర్లకు టెస్ట్ మ్యాచ్ ఆడే ఓపిక ఉంటుందా అని అనుమానంతో భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ 5 టెస్టుల సిరీస్ షురూ అయింది. సిరీస్లో 2 ఓటములతో చివరి మ్యాచ్ భారత్ ఓటమి 99% ఖాయం అనే స్థితి నుంచి అనూహ్య మలుపులతో సాగింది. కాసేపట్లో గెలుపు ఖాయమని టీవీలు ఆఫ్ చేస్తే వరుణుడు వచ్చి వాయిదా వేశాడు. ఓ మూల ఓ ఆశ పెట్టుకున్న క్రీడాభిమానులు.. జియో స్టార్లో 41 కోట్ల వీక్షకులు చూస్తుండగా ఎట్టకేలకు చివరి టెస్టు భారత్ గెలిచి సిరీస్ సమం చేసింది. భారత్ గెలిచే మ్యాచ్ ఓడటం ఓడే మ్యాచ్ డ్రా అవడం ఇలా అంచనాలు తారుమారు చేస్తూ అటు ఓటమిలో ఇటు గెలుపులో ఆఖరికి డ్రా కూడా అంచనాలకు భిన్నంగా ఫలితాలు ఇస్తూ సాగి టెస్ట్ మజా చూపిన చిరస్మరణీయ సిరీస్ గా ఇది నిలిచింది.