News13th Nov 12:18 PMSunil Byrisetty1 min read
టిల్మాన్ గ్లోబల్ రూ.15వేల కోట్ల పెట్టుబడులు
న్యూయార్క్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ గ్లోబల్ డిజిటల్ ఇన్ ఫ్రాస్ట్చక్చర్ సంస్థ టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ (టిజిహెచ్) ఆంధ్రప్రదేశ్ లో రూ.15వేల కోట్ల పెట్టుబడులు పెట్టేంద
న్యూయార్క్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ గ్లోబల్ డిజిటల్ ఇన్ ఫ్రాస్ట్చక్చర్ సంస్థ టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ (టిజిహెచ్) ఆంధ్రప్రదేశ్ లో రూ.15వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. న్యూఢిల్లీలో జరిగిన యుఎస్ – ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్ షిప్ సమ్మిట్ లో మంత్రి లోకేష్ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సమ్మిట్ కొనసాగుతుండగానే టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్ సంస్థ ఎపిలో రూ.15వేలకోట్లు పెట్టుబడి పెట్టనుందని సంధానకర్తగా వ్యవహరిస్తున్న ఎడోబ్ చైర్మన్ శంతను నారాయణ్ ప్రకటించారు. వెనువెంటనే డిజిహెచ్ చైర్మన్ చైర్మన్ అండ్ సిఇఓ సంజీవ్ అహూజా మంత్రి లోకేష్ సమక్షంలో అవగాహన ఒప్పంద పత్రాలను ఎపి ప్రభుత్వ ప్రతినిధులతో పంచుకున్నారు.