News18th May 09:46 AMSunil Byrisetty1 min read

కడపలో తిరంగా ర్యాలీ

కడప నగరంలో "Citizens for National Security" తిరంగా ర్యాలీ విజయవంతంగా నిర్వహించారు. జాతీయ భద్రతకు సంఘీభావంగా, మన సైనికుల ధైర్యం, త్యాగం, దేశ భద్రతను గౌరవించేందుకు ప్రత్యేకంగా ఈ ర్యా

కడపలో తిరంగా ర్యాలీ
కడప నగరంలో "Citizens for National Security" తిరంగా ర్యాలీ విజయవంతంగా నిర్వహించారు. జాతీయ భద్రతకు సంఘీభావంగా, మన సైనికుల ధైర్యం, త్యాగం, దేశ భద్రతను గౌరవించేందుకు ప్రత్యేకంగా ఈ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, APIIC చైర్మన్ రామరాజు, కడప పార్లమెంట్ ఇన్‌చార్జ్ భూపేష్ రెడ్డి, కూటమి నేతలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత సైనికులు ఆపరేషన్ సింధూర్ ద్వారా పాక్ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసి, దేశ శత్రువులకు గుణపాఠం చెప్పారు. భారత సైనికుల ధైర్యానికి, దేశ భద్రతకు సంఘీభావంగా మువ్వన్నెల జాతీయ పతాకం చేతబట్టి ర్యాలీ నిర్వహించారు.
Kadapa Kotireddy Circle
Tiranga rally
Pakistan
Operation Sindoor
Citizens for National Security
పల్లా శ్రీనివాస్
కడప పార్లమెంట్ ఇన్‌చార్జ్ భూపేష్ రెడ్డి
జాతీయ పతాకం చేతబట్టి ర్యాలీ
Scroll for the next article