Politics23rd Jan 11:44 AMSunil Byrisetty1 min read
తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో ముగిసిన సిట్ విచారణ
తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో సిట్ విచారణ ముగిసింది. ఏసీబీ కోర్టులో ఇవాళ ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. మొత్తం 12 రాష్ట్రాల్లో 15 నెలలపాటు సిట్ విచారణ కొనసాగింది. ఈ కేసులో
తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో సిట్ విచారణ ముగిసింది. ఏసీబీ కోర్టులో ఇవాళ ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. మొత్తం 12 రాష్ట్రాల్లో 15 నెలలపాటు సిట్ విచారణ కొనసాగింది. ఈ కేసులో బోలేబాబా డెయిరీ డైరెక్టర్లు కీలక సూత్రధారులుగా గుర్తించింది. అందులో భాగంగా తొలి ఛార్జ్షీట్లో 24 మందిని నిందితులుగా సిట్ పేర్కొంది. తాజాగా మరో 12 మంది హస్తం ఉన్నట్లు సిట్ అధికారులు కోర్టుకు తెలిపారు. దీంతో మరింత మంది పేర్లు వెలుగులోకి రానున్నాయి.