News14th Jul 03:58 PMSunil Byrisetty1 min read

తిరుపతిలో అగ్నిప్రమాదం

తిరుపతి రైల్వే‌ స్టేషన్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎక్స్‌ప్రెస్ రైళ్లలో చెలరేగిన మంటలు హడలెత్తించాయి. స్టేషన్ లూప్‌ లైన్‌లో ఆగి ఉన్న రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు.. రాయలసీమ, షిర్

తిరుపతిలో అగ్నిప్రమాదం
తిరుపతి రైల్వే‌ స్టేషన్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎక్స్‌ప్రెస్ రైళ్లలో చెలరేగిన మంటలు హడలెత్తించాయి. స్టేషన్ లూప్‌ లైన్‌లో ఆగి ఉన్న రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు.. రాయలసీమ, షిర్డీ ఎక్స్‌ప్రెస్‌లలో ఈ ప్రమాదం సంభవించింది. ప్రయాణికులను దించి లూప్ లైన్లో ఆగి ఉన్న రైలులోని ఒక బోగీలో అగ్నిప్రమాదం చోటుచేసుకొని మంటలు ఎగిసిపడ్డాయి. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే మంటల్ని ఆర్పేశారు. అగ్నిప్రమాదంపై రైల్వే అధికారులు దర్యాప్తు చేపట్టారు.
Andhra Pradesh news
tirupati railway station
Tirupati Train Fire Incident
Rayalaseema
Shirdi Express
bhogi
loop line
తిరుపతి రైల్వే‌ స్టేషన్‌లో అగ్ని ప్రమాదం
Scroll for the next article