Entertainment22nd Aug 09:27 AMSunil Byrisetty1 min read
ముగిసిన టాలీవుడ్ వివాదం.. షూటింగ్ షురూ!
టాలీవుడ్లో 18 రోజుల గ్యాప్ తర్వాత నేటి నుంచి షూటింగ్లు షురూ అవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో లేబర్ కమిషనర్ మధ్యవర్తిత్వంతో చర్చలు ఫలించాయి. 22.5% వేతన పెంపునకు ఇరు వర్గాలు
టాలీవుడ్లో 18 రోజుల గ్యాప్ తర్వాత నేటి నుంచి షూటింగ్లు షురూ అవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో
లేబర్ కమిషనర్ మధ్యవర్తిత్వంతో చర్చలు ఫలించాయి. 22.5% వేతన పెంపునకు ఇరు వర్గాలు ఆమోదం తెలిపాయి. మొదటి ఏడాది 15%, రెండో ఏడాది 2.5%
మూడో ఏడాది 5% పెంచేందుకు అంగీకరించాయి. అలాగే ఇతర సమస్యల పరిష్కారానికి కమిటీ వేసినట్లు అడిషనల్ లేబర్ కమిషనర్ తెలిపారు. కమిటీలో ఇండస్ట్రీ, ప్రభుత్వ వర్గాల సభ్యులు ఉంటారు. నెల రోజుల్లో మిగతా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.