News21st May 05:07 PMSunil Byrisetty1 min read

అమరావతికి ప్రతిష్టాత్మక బిజినెస్ స్కూల్

పేరు మోసిన బిజినెస్ స్కూల్ అమరావతి రాజధానికి రానుంది. ఏపీలో ప్రతిష్టాత్మక సంస్థ XLRI బిజినెస్ స్కూల్ నిర్మాణ పనులను అమరావతిలో త్వరలో ప్రారంభించనుంది. ఇందుకోసం కూటమి సర్కారు తుళ్లూర

అమరావతికి ప్రతిష్టాత్మక బిజినెస్ స్కూల్
పేరు మోసిన బిజినెస్ స్కూల్ అమరావతి రాజధానికి రానుంది. ఏపీలో ప్రతిష్టాత్మక సంస్థ XLRI బిజినెస్ స్కూల్ నిర్మాణ పనులను అమరావతిలో త్వరలో ప్రారంభించనుంది. ఇందుకోసం కూటమి సర్కారు తుళ్లూరు మండలం ఐనవోలులో 50 ఎకరాలను కేటాయించింది. రూ.250 కోట్లతో తమ క్యాంపస్ ను ఏర్పాటు చేయనున్నట్టు సదరు సంస్థ వెల్లడించింది. ఈ క్రమంలోనే నిన్న CRDA అధికారులతో చర్చలు కూడా జరిపింది. ఇక ఈ సంస్థ జెంషెడ్పూర్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. బిజినెస్ స్కూల్ ఏర్పాటైతే అమరావతి ప్రతిష్ట మరింత పెరగనుంది.
Amaravati
Xlri Management
Business Institution
అమరావతికి ప్రతిష్టాత్మక బిజినెస్ స్కూల్
తుళ్లూరు మండలం ఐనవోలులో 50 ఎకరాలను కేటాయించింది
Scroll for the next article