Spiritual8th Aug 03:44 PMSunil Byrisetty1 min read

అహోబిలంలో పర్యాటక అభివృద్ధి

దిగువ అహోబిలం, ఎగువ అహోబిలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని APTDC చైర్మన్ డా. నూకసాని బాలాజీ దర్శించుకున్నారు. అనంతరం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సుమారు రూ.25 కోట్లతో జరుగుతున్న వి

అహోబిలంలో పర్యాటక అభివృద్ధి
దిగువ అహోబిలం, ఎగువ అహోబిలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని APTDC చైర్మన్ డా. నూకసాని బాలాజీ దర్శించుకున్నారు. అనంతరం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సుమారు రూ.25 కోట్లతో జరుగుతున్న వివిధ అభివృద్ధి, నిర్మాణ పనులను పరిశీలించారు. అహోబిలంలోని పురాతన ఆలయ నిర్మాణాలు, శిల్పకళా వైభవం, సహజ సౌందర్యాన్ని పరిరక్షించుకోవాలన్నారు. మన పూర్వీకుల అద్భుతమైన నిర్మాణ నైపుణ్యం, కళా ప్రతిభ, వారసత్వ సంపద అద్భుతమన్నారు. అహోబిలం ఆధ్యాత్మికతతో పాటు చారిత్రక, సాంస్కృతిక, ప్రకృతి పర్యాటకానికి అపారమైన అవకాశాలు కలిగిన ప్రాంతమని పేర్కొన్నారు. అహోబిలాన్ని ఆధ్యాత్మిక, వారసత్వ మరియు ప్రకృతి పర్యాటక కేంద్రంగా మరింత సమగ్రంగా అభివృద్ధి చేసి, దేశీయ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో సౌకర్యాలను కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు.
Andhra Pradesh
Temple Tourism
Ahobilam
Tourism Development
APTDC
Nookasani Balaji
Lakshmi Narasimha Swamy
వారసత్వ పర్యాటకం
ప్రకృతి పర్యాటకం
పర్యాటక ప్రాజెక్టులు
ఆధ్యాత్మిక పర్యాటకం
సాంస్కృతిక వారసత్వం
ఏపీ టూరిజం
Scroll for the next article