News30th Apr 09:43 AMSunil Byrisetty1 min read
అమరావతికి ప్రధాని.. ట్రాఫిక్ మల్లింపు!
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతి పర్యటన సందర్భంగా మే 2 న ట్రాఫిక్ మళ్లింపులు చేస్తున్నట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రకటించారు. మే 2న ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రా
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతి పర్యటన సందర్భంగా మే 2 న ట్రాఫిక్ మళ్లింపులు చేస్తున్నట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రకటించారు.
మే 2న ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు అమలులోకి వస్తాయి.
ప్రధాని పర్యటన సందర్భంగా జాతీయ, రాష్ట్ర రహదారులపై ట్రాఫిక్ రద్దీని నివారించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
భారీ వాహనాలు, ఇతర వాహనాలు చెన్నై వైపు నుంచి ఒంగోలు జిల్లా త్రోవగుంట నుంచి చీరాల మీదుగా హనుమాన్ జంక్షన్ వైపునకు మళ్ళించడం జరుగుతుంది.
,చిలకలూరిపేట వైపు నుంచి పెనుమూడి బ్రిడ్జ్ మీదుగా విశాఖపట్నం వైపు మళ్లించారు.
అలాగే అన్ని ప్రధాన రహదారుల్లో ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేశారు.
ట్రాఫిక్ మళ్లింపుల దృశ్య ప్రాతినిధ్యం కోసం మ్యాప్ చూడాలని డీజీపీ కోరారు.