News12th Jan 02:35 PMSunil Byrisetty1 min read
పొలంలో వరి నాట్లు వేసిన ట్రైనీ డిప్యూటీ కలెక్టర్
సివిల్ సర్వీసెస్ అధికారి హోదాను పక్కన పెట్టి పొలంలోకి దిగారు. జగిత్యాల ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ హరిణి పంట పొలాల్లోకి దిగి స్వయంగా వరి నాట్లు వేశారు. హరిణి క్షేత్రస్థాయిలో చేసిన పని
సివిల్ సర్వీసెస్ అధికారి హోదాను పక్కన పెట్టి పొలంలోకి దిగారు. జగిత్యాల ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ హరిణి పంట పొలాల్లోకి దిగి స్వయంగా వరి నాట్లు వేశారు. హరిణి క్షేత్రస్థాయిలో చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శిక్షణలో భాగంగా కొడిమ్యాల మండలం నాచుపల్లిని సందర్శించిన ఆమె, పంట పొలాల్లోకి దిగి స్వయంగా వరి నాట్లు వేశారు. రైతులతో కలిసి పని చేస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉన్నత పదవిలో ఉండి కూడా సాధారణ మహిళలా బురదలోకి దిగి నాట్లు వేయడంపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.