News18th Apr 09:55 AMSunil Byrisetty1 min read
గోశాల అప్డేట్.. భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు
తిరుపతిలోని ఎస్వీ గోశాలలో గోవుల మృతిపై ప్రశ్నించిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డిపై కేసు నమోదైంది. గోశాలలో 191 ఆవులు ఏడాది కాలంలో చనిపోయాయంటూ గోశాల అధికారులు స్పష్టం చేశారన
తిరుపతిలోని ఎస్వీ గోశాలలో గోవుల మృతిపై ప్రశ్నించిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డిపై కేసు నమోదైంది.
గోశాలలో 191 ఆవులు ఏడాది కాలంలో చనిపోయాయంటూ గోశాల అధికారులు స్పష్టం చేశారని భూమన మాట్లాడారు.
అయితే పాలకమండలి గోవులు మృతి చెందలేదంటోంది.
ఎస్వీ గోశాలపై అసత్యపు ప్రచారం చేశారంటూ టీటీడీ పాలకమండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి ఫిర్యాదు చేశారు.
దీనిపై క్రైమ్ నెంబర్ 62/20 25 బి.ఎన్.ఎస్ యాక్ట్ 353(1), 299, 74 ఆఫ్ ఐటీ యాక్ట్ సెక్షన్ల కింద భూమనపై కేసులు నమోదు చేశారు.
అయితే ఈ కేసులో భూమనను అరెస్టు చేస్తారా లేదా చూడాల్సి ఉంది.