News18th Aug 11:44 AMSunil Byrisetty1 min read

రెండు దశాబ్దాల నిరీక్షణకు త్వరలో తెర

మంగళగిరి- తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి యర్రబాలెం అసైన్డ్ భూ యజమానులు రెండు దశాబ్దాల నిరీక్షణకు ఎట్టకేలకు తెర పడనుంది. మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే, ఐటీ విద్యా శాఖల మంత్రి నారా లో

రెండు దశాబ్దాల నిరీక్షణకు త్వరలో  తెర
మంగళగిరి- తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి యర్రబాలెం అసైన్డ్ భూ యజమానులు రెండు దశాబ్దాల నిరీక్షణకు ఎట్టకేలకు తెర పడనుంది. మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే, ఐటీ విద్యా శాఖల మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో అసైన్డ్ భూమి లబ్ధిదారులకు ఊరట కలగనుంది. ఈ మేరకు డిప్యూటీ కలెక్టర్ ఈ నెల 12 వ తేదీన సిఆర్డిఏ కమిషనర్ కు లేఖ కూడా రాసారు. మంగళగిరి - తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి యర్రబాలెం గ్రామం లోని సర్వే నంబరు 774లోని 30.72 ఎకరాల భూములు ఆర్ఎస్ఆర్ ప్రకారం చెరువు పోరంబోకు భూమిగా నమోదయి ఉంది. అయితే 1924 - 1926 మధ్య అసైన్డ్ మెంట్ చేశారు. పది సంవత్సరాలు పాటు భూములను యజమానులు విక్రయించరాదని కండీషన్ పట్టాలు ఇచ్చారు. 1936 నుంచి వ్యవసాయ భూములుగా రిజిస్ట్రేషన్ లు జరిగాయి. ఈ నేపథ్యంలో గత 2007 లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రిగా కొనసాగిన వైయస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అసైన్డ్ భూములలో భాగంగా ఎర్రబాలెం లోని సర్వే నంబర్ 774 కు కూడా ఆ జాబితాలో చేర్చుతూ ఉత్తర్వులు జారీ చేశారు. అప్పటి నుంచి ఆ భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. మంత్రి లోకేష్ లేఖతో ఈ సమస్యకు తెర పడనుంది.
Andhra Pradesh
Land Registrations
Yerrabalem
Mangalagiri
Tadepalli
Assigned Lands
Landowners
Nara Lokesh
CRDA
భూ రిజిస్ట్రేషన్లు
అసైన్డ్ భూమి లబ్ధిదారులు
రెవెన్యూ శాఖ
మంగళగిరి నియోజకవర్గం
భూ సమస్యలు
Scroll for the next article