News19th Aug 04:22 PMSunil Byrisetty1 min read
కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు..!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ అయింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. రూ.13,041 కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోద
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ అయింది. ఈ సందర్భంగా
కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. రూ.13,041 కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీలో గూడూరు నుంచి తమిళనాడు లోని గుమ్మిడిపుండి వరకు 3, 4వ రైల్వే లైన్లకు ఆమోదం ప్రకటించింది. రూ.3,352 కోట్ల వ్యయంతో ఖరగ్పూర్-భద్రక్ 4వ రైల్వే లైన్కు ఆమోదం తెలిపింది.
రూ.1,583 కోట్ల వ్యయంతో భద్రక్-హరిదాస్పూర్ మధ్య 4వ రైల్వే లైన్కు ఆమోదం ప్రకటించింది. రూ.2,586 కోట్ల వ్యయంతో కటక్-పారాదీప్ 3, 4వ రైల్వే లైన్లకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.