News28th Dec 03:17 PMSunil Byrisetty1 min read
ప్రపంచంలో విద్య ఒక్కటే అభివృద్ధికి రాజమార్గం
నరసాపురం మండలం పెదమైనవాని లంక గ్రామంలో ఆదివారం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో యూనియన్ బ్యాంకు వారి సహకారంతో రూ.18 లక్షలు విలువచేసే కంప్యూటర్లు, సైన్సు ల్యాబ్లు, తదితర మౌలిక సదుపాయా
నరసాపురం మండలం పెదమైనవాని లంక గ్రామంలో ఆదివారం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో యూనియన్ బ్యాంకు వారి సహకారంతో రూ.18 లక్షలు విలువచేసే కంప్యూటర్లు, సైన్సు ల్యాబ్లు, తదితర మౌలిక సదుపాయాలు ప్రారంభించి, కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ విద్యార్థులకు అంకితం చేశారు. కేంద్ర ఆర్థిక శాఖామంత్రితో పాటు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర ఆర్థికశాఖా మంత్రి పయ్యావుల కేశవ్, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి డా.నిమ్మల రామానాయుడు, రాష్ట్ర బిజెపి అధ్యక్షులు పి.వి.యన్.మాధవ్, జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ, నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, ఏపిఐఐసి ఛైర్మన్ మంతెన రామరాజు, తదితరులు పాల్గొన్నారు. విద్యార్థిని, విద్యార్థులతో మమేకమై వారితో కొద్దిసేపు కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ముచ్చటించారు. కొన్ని ప్రశ్నలు వేసి సమాధానం రాబట్టారు. డిజిటల్ క్లాసులు ద్వారా ప్రపంచలో జరుగుచున్నవాటిని, ఉన్నత విద్యా ప్రమాణాలు చక్కగా తెలుసు కోవచ్చునని, ప్రతి విద్యార్థి హాజరు అయ్యేలా ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.