TTD21st Aug 11:09 AMSunil Byrisetty1 min read

వాడపల్లి వేంకటేశ్వర స్వామి వారికి రూ.1.42 కోట్ల హుండీ ఆదాయం

కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో హుండీల లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి, శ్రీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ హుండీల నుంచి మొత్తం రూ.1

వాడపల్లి వేంకటేశ్వర స్వామి వారికి రూ.1.42 కోట్ల హుండీ ఆదాయం
కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో హుండీల లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి, శ్రీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ హుండీల నుంచి మొత్తం రూ.1,19,58,204లు ఆదాయంగా లభించింది. అన్న ప్రసాదం హుండీల నుంచి రూ.22,58,603 ల ఆదాయం లభించింది. మొత్తం 28 రోజులకు గాను రూ.1,42,16,807 లు ఆదాయంగా లభించినట్లు డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు తెలిపారు. నగదుతో పాటు 23 గ్రాముల బంగారం, 670 గ్రాముల వెండి కానుకలు లభించినట్లు ఆయన తెలిపారు. మొత్తం పది దేశాలకు చెందిన 46 విదేశీ కరెన్సీ నోట్లు సైతం లభించినట్లు తెలిపారు. హుండీ లెక్కింపుకు పర్యవేక్షణాధికారిగా అమలాపురం దేవాదాయ శాఖ అధికారి,అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ, తనిఖీదారుగా టీవీఎస్ ఆర్ ప్రసాద్, డి సతీష్ కుమార్, గోపాలపురం గ్రూప్ త్రీ దేవాలయాల తదితరులు వ్యవహరించారు. అర్చక స్వాములు, గ్రామస్తులు, పత్రికా ప్రతినిధులు, శ్రీవారి సేవకులు, దేవస్థానం సిబ్బంది, హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.
Andhra Pradesh
Vadapalli Venkateswara Swamy
Temple Hundi Income
Konaseema Tirumala
Temple Collections
Gold and Silver Offerings
Foreign Currency Donations
Devotees Contributions
Temple Revenue
వాడపల్లి
వేంకటేశ్వర స్వామి వారికి రూ.1.42 కోట్ల హుండీ ఆదాయం
Scroll for the next article