News16th Apr 05:26 PMSunil Byrisetty1 min read
ప్రపంచంలోనే ఎత్తైన రైలు వంతెన.. వందేభారత్ పరుగులు
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు వంతెనపై వందేభారత్ రైలు పరుగులు తీయనుంది. జమ్ము కశ్మీర్లోని వైష్ణోదేవి కట్రా- శ్రీనగర్ మధ్యలో ఉన్న చినాబ్ రైల్వే బ్రిడ్జి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రై
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు వంతెనపై వందేభారత్ రైలు పరుగులు తీయనుంది.
జమ్ము కశ్మీర్లోని వైష్ణోదేవి కట్రా- శ్రీనగర్ మధ్యలో ఉన్న చినాబ్ రైల్వే బ్రిడ్జి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు వంతెనగా గుర్తింపు పొందింది.
ఈ వంతెనను ఈ నెల 19న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.
దీనిపై ఇక వందే భారత్ రైలు ప్రయాణం సాగించనుంది.
న్యూఢిల్లీ నుంచి కశ్మీర్ వరకు నడిచే వందేభారత్ రైలుతో ప్రయాణ దూరం గణనీయంగా తగ్గనుంది.
ప్రస్తుతం కట్రా -శ్రీనగర్ మధ్య రోడ్డు ప్రయాణం 7 గంటలుండగా అది 3 గంటలకు తగ్గనుంది.
ఇది జమ్మూను, కశ్మీర్ను అనుసంధానించే తొలి రైల్వే లైన్ కావడం విశేషం.