Politics5th Sep 12:34 PMSunil Byrisetty1 min read
జగన్కు విజయమ్మ షాక్!
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన తల్లి విజయమ్మ షాకిచ్చారు. తమ వాటాగా వచ్చే ఆస్తుల్ని ఎన్సీఎల్టీలో కేసు వేసి లాక్కోవడంపై జగన్ రెడ్డి తల్లి మనస్తాపానికి గురయ్యారు. దీనిప
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన తల్లి విజయమ్మ షాకిచ్చారు. తమ వాటాగా వచ్చే ఆస్తుల్ని ఎన్సీఎల్టీలో కేసు వేసి లాక్కోవడంపై జగన్ రెడ్డి తల్లి మనస్తాపానికి గురయ్యారు. దీనిపై ఆమె న్యాయపోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. హైదరాబాద్ ఎన్సీఎల్టీ ఇచ్చిన తీర్పు .. అన్యాయంగా ఉందని, అధికారం లేకపోయినా తీర్పు ఇచ్చారని చెప్పి చెన్నై ట్రిబ్యునల్ ను.. విజయమ్మ ఆశ్రయించారు. సరస్వతి పవర్ సిమెంట్స్ వ్యవహారాలు అన్నీ చట్టబద్ధంగా జరిగాయని.. అన్నీ అయిపోయిన తర్వాత కుటుంబ వివాదాన్ని జగన్ రెడ్డి ఎన్సీఎల్టీకి తీసుకు వస్తే.. సంబంధం లేకపోయినా విచారించి జగన్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చారని విజయమ్మ అంటున్నారు.