Spiritual1st Sep 09:56 AMSunil Byrisetty1 min read
మైసూరును మించి దసరా
విజయవాడలో దసరా వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. వేడుకలను మైసూరు తరహాలో నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు విజయవాడ ఉత్సవ్ పేరుతో సన్నాహాలు ప్రారం
విజయవాడలో దసరా వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. వేడుకలను మైసూరు తరహాలో నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు విజయవాడ ఉత్సవ్ పేరుతో సన్నాహాలు ప్రారంభించింది. నగరంలోని నదీ పరివాహక ప్రాంతాలు సహా అన్ని ప్రాంతాల్లోనూ సినీ, సాంస్కృతిక కళా ప్రదర్శనలు, అమ్యూజ్మెంట్ పార్కులు, జలక్రీడలు, హెలీకాఫ్టర్ రైడ్, దుకాణ సముదాయాల స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. అలాగే మిరుమిట్లు గొలిపే డ్రోన్ల ప్రదర్శనలు కనువిందు చేసేలా విజయవాడ ఉత్సవ్ అలరించనుంది.