News23rd Apr 11:26 AMSunil Byrisetty1 min read
వెంటాడి మరీ కాల్చేశారు.. ఉగ్రదాడిలో విశాఖ వాసి మృతి!
జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో విశాఖపట్నం వాసి ఉన్నట్లు గుర్తించారు. అత్యంత అమానవీయంగా వెంటాడి మరీ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘోర కలిలో విశాఖ వాసి, విశ్రాంత బ్యాం
జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో విశాఖపట్నం వాసి ఉన్నట్లు గుర్తించారు.
అత్యంత అమానవీయంగా వెంటాడి మరీ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
ఈ ఘోర కలిలో విశాఖ వాసి, విశ్రాంత బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళి మృతి చెందారు.
పారిపోతున్న ఆయన్ను వెంటాడి మరీ చంపినట్లు సమాచారం.
చంపొద్దని వేడుకున్నా ఉగ్రమూకలు ఏమాత్రం కనికరించకుండా ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.
చంద్రమౌళి మృతదేహాన్ని సహచర టూరిస్టులు గుర్తించడంతో విశాఖలోని కుటుంబ సభ్యులకు సమాచారం అందింది.
సమాచారం తెలిసిన వెంటనే విశాఖపట్నం నుంచి కుటుంబసభ్యులు పహల్గాంకు బయల్దేరి వెళ్లారు.