News10th Oct 04:33 PMSunil Byrisetty1 min read

మినీ ముంబైగా విశాఖ.. కేబినెట్లో కీలక నిర్ణయాలు

విశాఖను దేశ ఆర్థిక రాజధాని ముంబై తరహాలో ఒక శక్తివంతమైన ఆర్థిక, సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. ఇప్పటికే గూగుల్, టీసీఎస్ వంటి ప్రపంచ ప్రఖ్యాత

మినీ ముంబైగా విశాఖ.. కేబినెట్లో కీలక నిర్ణయాలు
విశాఖను దేశ ఆర్థిక రాజధాని ముంబై తరహాలో ఒక శక్తివంతమైన ఆర్థిక, సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. ఇప్పటికే గూగుల్, టీసీఎస్ వంటి ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజాలు విశాఖకు వస్తున్నాయని, నగరాన్ని ఒక అంతర్జాతీయ ఐటీ హబ్‌గా మార్చడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ పెట్టుబడులతో విశాఖ స్వరూపం పూర్తిగా మారిపోనుందని, మౌలిక సదుపాయాలు మెరుగుపడి ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలో రాష్ట్రానికి రూ. 1,14,824 కోట్ల విలువైన భారీ పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసినట్టు తెలుస్తోంది. ఈ నిర్ణయం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊతాన్ని ఇవ్వడంతో పాటు, వేలాది ఉద్యోగాల కల్పనకు మార్గం సుగమం చేస్తుందని ప్రభుత్వం విశ్వాసం వ్యక్తం చేస్తోంది. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ నిర్ణయాలు పారిశ్రామిక రంగంలో ఏపీని అగ్రస్థానంలో నిలబెడతాయని భావిస్తున్నారు.
Andhra Pradesh
Visakhapatnam
Mini Mumbai
Chandrababu naidu
Ap cabinet
Investments
IT Hub
గూగుల్
టీసీఎస్
ఉద్యోగాలు
మౌలికసదుపాయాలు
పరిశ్రమలు అభివృద్ధి
Scroll for the next article