Politics21st Jul 05:01 PMSunil Byrisetty1 min read
పోలవరాన్ని కాపాడింది మేమే!
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రశ్నార్థకమైన పోలవరం ప్రాజెక్టును కాపాడామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. నీటి ప్రాధాన్యాన్ని ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకూ గుర్తించారని తెలిపారు.
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రశ్నార్థకమైన పోలవరం ప్రాజెక్టును కాపాడామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. నీటి ప్రాధాన్యాన్ని ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకూ గుర్తించారని తెలిపారు. విధ్వంసమైన ఇరిగేషన్ రంగాన్ని పట్టాలెక్కించి, ఇరిగేషన్ క్యాలెండర్ను కూడా రూపొందించుకున్నామన్నారు. పోలవరం రాష్ట్రానికి వరం, జీవ నాడి అన్నారు. 2019-24 మధ్య కూడా టీడీపీ ప్రభుత్వమే కొనసాగి ఉంటే 2021-22 నాటికే ప్రాజెక్ట్ పూర్తయ్యేదని చెప్పుకొచ్చారు. పోలవరం నిర్వాసితులకు ఇచ్చిన ఒక్క హమీని కూడా వైసీపీ ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. పోలవరానికి కేంద్రం ఇచ్చిన నిధులను కూడా మళ్లించారని ఆరోపించారు.