News22nd Nov 03:12 PMSunil Byrisetty1 min read

రైతులకు అన్యాయం జరగనివ్వం

రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వబోమని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఈ రోజు ఉదయం జరిగిన సీఆర్డీఏ సమావేశంలో మంత్రి ఈ

రైతులకు అన్యాయం జరగనివ్వం
రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వబోమని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఈ రోజు ఉదయం జరిగిన సీఆర్డీఏ సమావేశంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై సీఆర్డీఏ కార్యాలయంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, పురపాలక శాఖ మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ల త్రిసభ్య కమిటీ సమావేశమైంది. సమావేశంలో రైతు జేఏసీ ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులు లేవనెత్తిన పలు అంశాలపై చర్చ జరిగింది. వాటి పరిష్కారం కోసం కమిటీ సమాలోచనలు చేసింది. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. ఏ రైతుకూ ఇబ్బంది లేకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రాజధానిలో పెండింగ్‌ లో ఉన్న జరీబు భూముల సమస్యకు 30 రోజుల్లో పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. గ్రామ కంఠాలు, లంక భూముల సమస్యలనూ పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
AP Capital
Farmers Issues
Minister Narayana
CRDA Meeting
Land Pooling Farmers
Amaravati Capital
Pemmassani Chandrasekhar
భూ జరీబు
గ్రామ కంఠాలు
లంక భూములు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
రాజధాని నిర్మాణం
Scroll for the next article