News13th Dec 03:24 PMSunil Byrisetty1 min read
మెస్సీకి, క్రీడాభిమానులకు సీఎం క్షమాపణలు!
కోల్కాతాలోని స్టేడియంలో ఏర్పడిన అనుకోని గందరగోళం నేపథ్యంలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ క్షమాపణలు చెప్పారు. ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీతో పాటు, మ్యాచ్ వీక్షించేందుకు వచ్
కోల్కాతాలోని స్టేడియంలో ఏర్పడిన అనుకోని గందరగోళం నేపథ్యంలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ క్షమాపణలు చెప్పారు. ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీతో పాటు, మ్యాచ్ వీక్షించేందుకు వచ్చిన క్రీడాభిమానులందరికీ ఆమె బహిరంగంగా క్షమాపణ తెలిపారు. “మెస్సీ వంటి ప్రపంచస్థాయి క్రీడాకారుడి పర్యటనలో ఇలాంటి పరిస్థితి తలెత్తడం బాధాకరం. స్టేడియంలో గందరగోళం ఏర్పడినందుకు నేను వ్యక్తిగతంగా క్షమాపణ చెబుతున్నాను. క్రీడాభిమానుల అసౌకర్యానికి కూడా ప్రభుత్వం తరఫున విచారం వ్యక్తం చేస్తున్నాను” అని అన్నారు. అనూహ్యంగా అభిమానుల భారీ రాక, భద్రతా ఏర్పాట్లలో లోపాల వల్ల స్టేడియంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో కార్యక్రమం ఆలస్యమైంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు వెంటనే చర్యలు చేపట్టారని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం మమత హామీ ఇచ్చారు.