News5th Sep 03:15 PMSunil Byrisetty1 min read
ఆయన అధికారంలో ఉన్నప్పుడల్లా కరువే
సీఎం చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడల్లా కరువేనని వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. పోలవరం ఎడమ కాలువకు గ్రావిటీతో నీరివ్వాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో
సీఎం చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడల్లా కరువేనని వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. పోలవరం ఎడమ కాలువకు గ్రావిటీతో నీరివ్వాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలి కానీ ఏకగ్రీవాలుగా కాదన్నారు. డీఎస్సీలో ఉద్యోగాల కోసం బేరాలు పెట్టారని, స్పోర్ట్స్ కోటాలో అక్రమ నియామకాలు జరిగాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో శాసన
మండలిలో చర్చకు రమ్మంటే తోకముడిచారంటూ బొత్స ఎద్దేవా చేశారు.
విశాఖపట్నంలో రూ.3 వేలకోట్ల భూములను గీతం యూనివర్సిటీకి ధారాదత్తం చేశారని ఆరోపణలు చేశారు.