National13th Sep 12:19 PMSunil Byrisetty1 min read
బాణసంచాపై నిషేధంపై సుప్రీంకోర్టు
దేశవ్యాప్తంగా బాణసంచాపై నిషేధం విధించాలా అనే అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం కాలుష్యం కారణంగా కేవలం ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లోనే బాణసంచా కాల్చడంపై నిషేధం
దేశవ్యాప్తంగా బాణసంచాపై నిషేధం విధించాలా అనే అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం కాలుష్యం కారణంగా కేవలం ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లోనే బాణసంచా కాల్చడంపై నిషేధం అమల్లో ఉంది. అయితే దేశంలోని ఇతర నగరాల్లో పరిస్థితి ఎలా ఉందని సీజేఐ ప్రశ్నించారు. “కేవలం ఢిల్లీ వాసులకు మాత్రమే స్వచ్ఛమైన గాలి కావాలా..? దేశంలోని మిగతా నగర ప్రజలకు అవసరం లేదా?” అంటూ సీజేఐ ప్రశ్నించగా, న్యాయస్థానంలో తీవ్ర చర్చ జరిగింది. ఈ అంశంపై విచారణను ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసిన సుప్రీంకోర్టు, అప్పటివరకు కేంద్రం, రాష్ట్రాల అభిప్రాయాలను సమర్పించాలని ఆదేశించింది.