News31st Aug 11:27 AMSunil Byrisetty1 min read
పులివెందులలో జగన్ పర్యటన
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందులలో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో కడప జిల్లాలో ఉండనున్నారు. సెప్టెంబర్ 2 న దివంగత ముఖ్యమంత్రి డా. వైయస్ రాజశేఖ
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందులలో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో కడప జిల్లాలో ఉండనున్నారు. సెప్టెంబర్ 2 న దివంగత ముఖ్యమంత్రి డా. వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొననున్నారు.
1వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు పులివెందుల చేరుకుని భాకరాపురంలోని క్యాంప్ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు.
2న పులివెందుల నివాసం నుంచి బయలుదేరి ఉదయం 7.15 గంటలకు ఇడుపులపాయ చేరుకుంటారు. వైఎస్సార్ ఘాట్ వద్ద రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి లింగాల మండలం అంబకపల్లి చేరుకుని గంగమ్మ కుంట వద్ద జలహారతి కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం పులివెందుల చేరుకుని క్యాంప్ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. 3న
ఉదయం 7 గంటలకు పులివెందుల నుంచి తిరుగు పయనమవుతారు.